Saturday, March 20, 2021

ఒక రోజెళ్లిపోయింది

 

 

(From Amaravathi Kadhalu- ఒక రోజెళ్లిపోయింది)

దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడనో లేక చింత చిగురు పచ్చడనో అంటే కారం జగ్రత్త అనేవారు .పిచ్చయ్య  గారికి రోజు నూరిన పచ్చడి వుండాలి . అందులో కారం దివ్యం గా ఉండాలి . లేకపోతె గొప్ప చిరాకు పడేవాడు . భోజనాననంతరం వక్క పలుకు వేసుకొని , పిచ్చయ్య గారు నులక మంచo లో వాలగా సేతమ్మ గారు కాళ్ళ దగ్గరకి చేరి , పాదాలకు ఆముదం రాసేవారు . వక్క పలుకులు నములుతూ నములుతూ నిద్ర పొతే అంతకే ముందే పట్టే మీద తల వాల్చి ఆవిడ కూడా నిద్రపోయేది .

సాయంత్రం పిచ్చయ్య గారు ఊరి చుట్టి వచ్చే వారు . పాండు రంగ స్వామి గుడ్లో ఆచారి గారికి , ఈయనకి సంభాషణ ప్రతి రోజు ఇలాగే ఉండేది . ‘ ఇవాళ ఏం కూర – పొట్లకాయ , పచ్చడో- కొత్తిమీర కారం , ఇవాళ ఎన్ని పూజలు – రెండు , ఏమిన గిట్టిందా ఏదో అని నవ్వేవాడు ఆచారి గారు’ పిచ్చయ్య గారు కూడా నవ్వే వారు . అక్కడ నుండి పెద్ద బజారులో రాముల వారి గుడి మెట్ల మీద కొంత సేపు కూర్చుని అక్కడ పిల్లల గోలీలాట చూసేవాడు .

పిల్లలతో పాటు తను గోలీలను లెక్కపెట్టేవాడు . రేగి కాయల కాలం అయితే ఏ గిద్దేడో కొని తలా ఒక రేగ్గాయ ఇచ్చేవాడు .

సంధ్య వేలకి తిరిగి గుళ్ళో కొచ్చేవాడు . గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చొని గోపురంలో రామ చిలుకల వైపు , ఊగుతున్న జమ్మి చెట్టు వైపు చూస్తూ ఉండేవాడు .

గుడి తలుపులు వేసే టపుడు ప్రసాదం గా పెట్టిన వడపప్పు తుండు గుడ్డ కొంగున కట్టుకొని ఇంటి కొచ్చేవాడు . రెండు మెతుకులు తిని , అన్ని పప్పు సితమ్మ గారికి పెట్టి , తను ఒక్కో గింజ నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయాడు .

అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒక రోజు తిరిగి లేవ లేదు .   

కాళ్ళ కట్ట నుండి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్యగారు పొతే గొల్లుమన లేదు . బొట్టు మాత్రం చేరుపుకొని , ఇంత కాలం నా ఎదురుగా ఉండేవారు ఇప్పుడు నా లోనే ఉన్నారు అనుకుంది . పిచ్చయ్య గారు ఏం సాదించలేదు , తగాదాలు తీర్చలేదు ,  సమస్యలను చర్చించ లేదు . కాని కాలానికి తెలియ కుండా కాలం తో కలిసి పోయి బ్రతికాడు .  


                             

అది చాలదా ? చాలడం లేదు చాలా మందికి ..

మాములుగా బ్రతికి చచ్చిపోయిన వాళ్ళే -మహానుబావులు 

Completed ..

Thursday, March 18, 2021

ఒక రోజెళ్లిపోయింది

 



(from Amaravathi Kadhalu -ఒక రోజెళ్లిపోయింది ) 

ఒక రోజు వెళ్ళిపోయింది మరో రోజు వస్తుది వెళ్లి పోయిన రోజు గురించి ఆలోచిస్తే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది

ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ గారు వెళ్ళిపోయారు చాలా మంది వేల్ల్లిపోయే ఈ లోకం లో పిచ్చయ గారు వెళ్ళిపోవడం ఓ విశేషం  కాదు పైగా ఆయన కవి ,గాయకుడు ఇలాంటి వేవి కాదు. జీవితం లో ఏదైనా సాదించాడన్నా అంటే  అది లేదు కాని పరుగెత్తే ప్రవాహంలో  అడుగు తెలియకుండా ఈదే  చేప పిల్లలా తొణకని సరసుల్లో కదలని అలలా ఆయన కాలానికి తెలియకుండా కలం తో కలిసిపోయి జీవితం అంతా గడిపాడు.

శబ్దాల గురించి అటుంచండి నిశ్శబ్దం లో పరమ నిశ్శబ్ద్ గ కలిసిపోయి ఆయన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక రోజు గమనిస్తే చాలు

ఉదయం ఆయన వీధి అరుగు మీద రాగానే పిచ్చయ బార్య సీతమ్మ గారు కుంబకోణం చెంబుతో నీళ్ళు, కచ్చిక తాటాకు పెట్టేది, మొహం కడుగి అటు నుండి ఆటే కృష్ణకి బయలుదేరతాడు. చలి ఏది ,వర్షం ఏది అని లేకుండా అంగోస్త్రం నడుం కి బిగించి కృష్ణ లో దూకవలిందే .

గుండె లోతు నీళ్ళల్లో నుంచి సంద్యా వందనం ముగించి , చెంబుతో క్రిశ్నోదకం తెసుకొని   గుడికి బయలేదేరేవాడు . దోవలో వీధి అరుగు మీద చిన్న పిల్లలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లని కృష్ణ నీళ్ళు వాళ్ళ మీద చిలకరించేవాడు .

వాళ్ళు చలి చలి అని ముడుచుకు పోతుంటే నడుచుకుంటూ ముందుకు సాగేవాడు .రెండో ప్రాకారం లోని గన్నేరు చెట్టు దగ్గరకి వచ్చి , పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలుoడాలే అనుకునే వాడు .

ఆయనకీ కొమ్మలు , రెమ్మలు , పువ్వులు అన్ని లెక్కే . పున్నాగ పూలు నాలుగు చెంబులో వేసుకొని మారేడు చెట్ల ఆకులు రెండు తెసుకొని మూడో ప్రాకారం ఎక్కేవాడు.

పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరేస్వరునికి అభిషేకం చేసి సిద్దంగా ఉండేవారు . స్వయంగా తెచ్చుకున్న క్రిశ్నోధకం తో అభిషేకం చేసుసోని పూలతో పూజ చేసేవాడు .

అది ఏ పూజ పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు , మంత్రం బయటకి వినిపించేది కాదు . ఆ స్వామికే తెలియాలి . పూజ ముగించుకొని బయటకు వచ్చి  గంట మోగించి , పక్కనే సాగిలపడే వారు .

అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మణులు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు . పెరుగుతున్న ధరల గురించి , ఆవకాయ ఊరగాయ గురించి , ఈ మాటలు సాగుతుంటే అన్ని వింటూ కూర్చునేవారు .మద్యలో  ఏ లింగయ్య పిచ్చయ్య గారు అవునంటారా , కాదంటారా అంటే చిరునవ్వు నవ్వేవారు .అంతే గాని పెదవి విప్పేవారు కాదు .

మద్యమద్యన గాలిగోపురంపై  వాలుతున్న పావురల్లను లెక్కపెడుతూ ఉండేవారు . అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటి కోస్తునే గుమ్మంలోంచి పచ్చడేమిటోయ్ అని పెద్దగా అరిసేవాడు .

                                                -to be continued..

                    

Saturday, March 6, 2021

NANNA KOPAM


 -pradeep devarapally

నా పేరు కిషోర్.వయసు ఒక 12 ఏళ్ళు ఉంటాయిలెండి. ఊరు మండపాక తణుకు  దగ్గర ,గోదావరి జిల్లా అండి.ఇది 12 ఏళ్ళ బుడ్డోడి చరిత్ర అనుకుంటున్నారా ..? ఇది అలంటి కధ కాదులేండి.

నేను 7 వ తరగతి చదువుతున్నాను మా ఊరిలో . క్లాసు లో ఫస్ట్ రాకపోయినా లాస్ట్ మాత్రం రానులేండి.ఎందుకంటె మాది మిడిల్ క్లాసు గా  ,మార్క్స్ కూడా మిడిల్ గానే వస్తుంటాయి. చదువు లో మిడిల్ అయిన గాని ఏదైన పోటిల్లో మాత్రం నేనే ఫస్ట్నండోయ్.అది ఫిజికల్ గా కాదు , ఎలాంటివంటే వ్యాసరచన ,వక్రుత్త్వం ఇలాంటివి అన్న మాట . మా స్కూల్ పెద్ద హై స్కూల్ కాకపోయినా మంచి టీచర్స్ మాత్రం ఉన్నారు .అందరు మగవాళ్ళే మా కర్మకి . కానీ ఈ మద్య చదువు పూర్తి చేసుకొని ఏదో టెంపరరీ గా  అనుకుంటా మా స్కూల్ లో ఒక ముగ్గురు లేడి టీచర్స్ జాయిన్ అయ్యారు .ముగ్గురు కూడా చాల అందంగా ఉన్నారు .వాళ్ళలో పద్మజ అనే టీచర్ అయితే చాల అందంగా ఉంది . కానీ చాలా కోపం నాన్న లాగ .

నాన్నంటే గుర్తుకోచ్చాడండోయ్ మా ఇంట్లో అమ్మా ,నేను ,తమ్ముడు ,నాన్న వుంటాం.అమ్మానాన్న కూడా మెట్రిక్యులేషన్ పాస్ అయిన వాళ్ళు. వాళ్లకి పాస్ అయిన వెంటనే పెళ్లి చేసారు .అప్పటికి వల్ల వయసు 16 ఏళ్ళు వుంటాయి. అమ్మ వాళ్ళది లంకలకోడేరు ,గోదావరి జిల్లా . తింటే తరిగి పోయే ఆస్తులు లేవు కానీ ,కూర్చొని పని చేసి జీతం సంపాదించే చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగుల కుటుంబం వాళ్ళది . మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత పై చదువులు చదివి ఉద్యోగం చెయ్యాలనే కోరిక అమ్మది .ఎలాగయినా చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చెయ్యాలనే సంకల్పం తాతది.

ఇటు నాన్న కుటుంబానికి వస్తే పొద్దున్న లేచామా , పొలానికి వెళ్ళమా  , పని చూసుకొని వచ్చామా అనే కుటుంబం వీళ్ళది. పొద్దునే గేదలకు గడ్డి వేసామా , పాలు తీశామా , పొలానికి ఎరువులు కొట్టామా , ఎకరానికి  ఎన్ని భస్తాలు వచ్చాయి అని లెక్కపెట్టామా అనే ద్యాస తప్ప ఇంకో శ్వాస వుండేది కాదు నాన్నకి .ఒక వంతెన రెండు మార్గాలని కలిపినట్టుగా ఒక పెళ్ళిలో బ్రోకరు అమ్మానాన్నలను కలిపాడు .

ఉష్... నాన్న విషయం లో పడి అసలు సంగతి మర్చిపోయాను . విషయం ఏంటంటే ప్రతి  సంక్రాంతి పండక్కి మా స్కూల్లో ఆటల పోటీలు , నాకు ఎంతగానో నచ్చిన వ్యాసరచన పోటీలు పెడతారు . ఆటల్లో మనం పాల్గొనక పోయిన వ్యాసరచన పోటిల్లో మనం వక్రతుoడుననే ,  వక్రుత్త్వం లో మనం వ్యాసుడనే . ఎప్పుడుఈ పోటీలు పెట్టిన ఏదో ఒక విషయo గూర్చి రాయడం గాని మాట్లాడటం గాని చెప్పేవారు . కాని ఈ సారి వ్యాసరచన పోటిల్లోఎవరకు ఇష్టమయిన దానిమీద వాళ్ళని రాయమని చెప్పి రెండు గంటలు టైం ఇచ్చారు .

ఏం రాద్దాం అని ఆలోచిస్తూనే అరగంట ముగిసిపోయింది . అలా దిక్కులు చూస్తూ ఉండగా కిటికీలోంచి పద్మజ టీచర్ కనిపించింది .ఒక్కసారిగా ఒక నవ్వు విసిరాను , కాని కోపంగా ఒక చూపు చూసింది . ద్రాక్ష పళ్ళు పళ్ళ మద్యలో ఉంచుకొని పళ్ళెం మొత్తం వెతికినట్టు ,ఉదాహరణ  ఇంట్లో ఉంచుకొని ఊరికే అటు ఇటు చూస్తూ సమయం గడపడందేనికి.

వెంటనే మైండ్ లోకి నాన్నని ,బల్లపై పేపరిని , చేతిలోకి పెన్నుని తీసుకొని రాయడం మొదలు పెట్టాను ఇలా ..

నాన్న కోపం

నాన్నకి కోపం చాలా ఎక్కువండి .ఒకసారి ఏం జరిందంటే ...

 -to be continued ..


Friday, March 5, 2021

RAILU PRAYANAM



 -pradeep devarapally

అప్పటికే పక్క ప్లాట్ ఫాం పై ఇంకో రైలు వచ్చే టట్లు వుంది . కొంత మంది ఈ ట్రైన్ లో నుండి అవతలకి దిగుతున్నారు .త్రివిక్రమ్ సిరివెన్నెల గారి గురించి చెప్పిన స్పీచ్ లో ‘చార్మినార్ ఇరుకు సందుల్లో పోర్షియో కార్ నడిపినట్టు’ అనే మాటలు గుర్తుకొచ్చాయి ఆ గేటు కి అటు ఇటు కూర్చున్న వాళ్లకి .

పిల్లడు పాల కోసం క్యార్ మని కేక పెట్టాడు , అవతల పట్టాలపై రైలు వేణు కూర్చున్న కిటికీ దాటి ప్యుయ్ ... మని శబ్దం తో నిదానంగా ప్రయానికులను దాటుకుంటూ స్టేషన్ పై ఆగుతుంది .

ఈ లోపల లావుపాటి మనిషి ముసలమ్మ తో గొడవ . బస్సు , రైలల్లో గొడవలు చాలా సరదాగా ఉన్న , ఆ గొడవ పడే వ్యక్తి మాత్రం సిగ్గుగా బావించడు. ఎందుకోగాని ఆ సీటు వాళ్లకి రాజ సింహాసనం లాగ , అవతల గొడవ పడే వ్యక్తి మరొక దేశపు సైనికుడిలా భావిస్తాడేమో బహుసా .

ఇది ఇలా ఉండగా ఓ స్త్రీ బాధ మరో లాగ ఉంది . తిరుగు చార్జీలకు సరిపడా చిల్లర పిల్లాడి చేతికిచ్చి , పట్నం లో సరుకులు కొందామని వెళ్తున్న సీత అనే అమ్మాయి చేతిలో 5 వేల రూపాయలు ఉన్న పర్స్ ఉన్నది .మరి ఇదేం సరదానో పక్కలో పిల్లడు పాసు పోసిన పట్టించుకోదేమో వాళ్ళ గొడవలో పడి ఆమె చేతిలో ఉన్న పర్స్ ను పారేసుకుంది .

ఇంతలో ఎవరో ఆ గేటు దగ్గర కూర్చున్నావు కదమ్మా ! ఇప్పటి దాకా అవతలకి ఇవతలకి తిరిగారు గా వాళ్ళల్లో ఎవరి చేతికి తగిలిందేమో పాపం అంటూ నెత్తిన జుట్టు తెల్లగా , పళ్ళు ఊడిపోయిన అవ్వ సన్నగా నిట్టూర్చింది.

అప్పుడే పక్క రైలు దిగి ఈ రైలు లోనికి ఎక్కిన దానిమ్మ కాయలు అమ్మే లావాటి మనిషి నిక్కరు , చొక్కా , నెత్తిన పెద్ద బుట్ట ని నెమ్మదిగా కిందకి దింపుతూ 5  కాయలు 100 అంటూ ఒక్క కేక వేసాడు.

అప్పటి దాక ఉన్న గొడవ రొదన వదిలి , బాధ బారాన్ని విడిచి తియ్యటి దానిమ్మలపై రెండు కళ్ళు వేసారు భోగి లో ఉన్న ప్రయాణికులు .

‘రావాలి 5 కాయలు 100 అయిపోతున్నాయి అంటూ , మేడం 6 కాయలు ఇస్తా అంటూ ఒక కవరు లో పెట్టి ఎదురుగా ఉన్న సీటులో కూర్చున్న ఒకావిడ చేతిలో పెట్టి తినండి మేడం , బాగుంటే డబ్బులివ్వ్వండి లేకుంటే ఊరికే తెసుకోండి  డబ్బులు కూడా వద్దు అంటూ’  చమత్కారం గా వ్యాపార లక్షణం ను చూపించాడు .

ఈ మాటకి దానిమ్మలు అమ్మే  వాడి దగ్గర కవర్లు నిండుతున్నాయి , బుట్ట కాలి అవుతుంది . అప్పటికే నోట్లో నీళ్ళు ఊరుతున్న వేణు అడగకుండా కిటికీ ఊచలను పట్టుకుని వాళ్ళ నాన్న వెంక చూసాడు .

అది అర్ధం చేసుకున్న రమణ బాబు ఇటు రా అంటూ  డబ్బులిచ్చి ఒక కవరను  తీసుకున్నాడు .ఈ హడావిడిలో  రైలు విజయవాడ దాటి కృష్ణా నది బ్రిడ్జి ఫై కి వచ్చింది . అప్పటిదాకా అమ్మ పక్కనే కుర్చుని ఉన్న రాము లేచి నాన్న పక్కకు చేరాడు .

చెవులకు ఇంపుగా వినిపించే ఆ హోరు , చూడడానికి అంధo  గా కనిపించే ఆ నీరు , నది ఒక్కొక్క కిటికీ దాటుకుంటూ పెంచుతున్న జోరు .

కంటికి కనిపించే కనకదుర్గమ్మ  గోపురాన్ని చూసి , కళ్ళను మూసి మనసులో ప్రార్ధించు కున్నాడు రమణ .

నెమ్మదిగా రైలు నదిని దాటుతున్న తీరు , వేణు లో తగ్గుతున్న జోరు , సంచిలో ఉన్న లడ్డు ని తిందామని నోరు తెరిచిన పక్క సీటు లో ఉన్న షావుకారు .

వేగాన్ని తగ్గించిన రైలు విజయవాడ తర్వాత ప్లాట్ ఫాం అయిన కృష్ణా కెనాల్ జంక్షన్ ను చేరించి.ఎప్పటి నుండో అమ్మగారింటికి వెళ్ళాలన్న తీరిక ఇప్పుడు కుదిరింది. అన్నతో స్కూల్ కి వెళ్ళేటపుడు గేటు గగ్గర చూడటం  తప్ప ఎప్పుడు ఎక్కని రైలులో  ప్రయాణించాలనే ‘రైలు ప్రయాణం’ కోరిక నెరవేరింది.


Thursday, March 4, 2021

AA NALUGURU



 -pradeep devarapally

ఇంటికి నాలుగడుగుల దూరంలో మా తాత పోతూపోతూ ఇచ్చిన 50 సెంట్ల పొలం . నాన్న కష్టం తో సంపాదించిన రెండు గేదలు. రెండు తరాలుగా మారకుండా ఉన్న పెంకుల ఇల్లు . ఇది మా ఇంటి బాహ్య స్వరూపం .

మరి గేటు దాటి ఇంటిలోకి తొంగి చూస్తే ... 

ఇటుకుల రంగు కనిపించే విధంగా వుండే గోడలు , నాపరాల్లకి సందులో చీమలు తిరిగే దారులు . నలుగురికి నాలుగు గదులు కాకపోయినా , వుండటానికి ఒక గది వండటానికి ఒక గది .

పైన పెంకులు , కింద నాపరాళ్ళు , మద్యలో తాడు సహాయం తో కట్టిన అరలు .

గుమ్మo దాటి బయటకు వస్తే తాటాకులతో కట్టిన చిన్న పాక . దానిలో రెండు గేదలు , పక్కనే కట్టేసిన తాడుని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కోడి . ఇవి సుబ్బారావు యొక్క ఇంటి విషయాలు .

ఈ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది . అది ఏంటంటే ఇంట్లో నలుగురు తప్ప ఐదుగురు  వుండటం సుబ్బారావు కూడా ఎప్పుడు చూడనే లేదు . సుబ్బారావు ఒక్కడే ఏంటి ! వాళ్ళ తాత ముత్తాతల కాలం నాటి నుండి అది ఆచారమో , దరిద్రమో కొనసాగుతూ వస్తుంది .

మాములుగా కుటుంబం అంటే  తోబట్టువులు , తోడు కోడళ్ళు , ఇల్లంతా గంపెడు పిల్లలు , మామ్మ  , తాత అంతా ఉంటె కుటుంబం అవుతుంది . కాని వీళ్ళ వoశoలో మాత్రం ఒకడు పుడుతున్నాడంటే లేక కలుస్తున్నారంటే   చాలు    ఇంకొకరు మరణిస్తారు .

ఇదేంటి వింత అనుకుంటున్నారా ..?

సుబ్బారావు వాళ్ళ తాత ల కాలం నాటి నుండి కూడా ఈ దరిద్రం కొనసాగుతుంది. బహుసా అందుకేనేమో మూడు పెంపుడు జంతువులను తప్ప నాల్గోదానిని పెంచుకోవడం లేదు .

అది 1980 వ సంవత్సరం. జోరు వాన , వేగంగా ఈదురు గాలులు. భోజనానికి ముందు విస్తరాకులను తడపాల్సిన నీళ్ళు, భారాన్ని దింపుకునెంతగా  పందిరి తాటాకులను తడుపుతున్నది వాన నీళ్ళు.

పంతులు మంత్రాలతో మారు మ్రోగాల్సిన పెళ్లి మండపం , తాటాకుల నుండి పడే నీళ్ళ చినుకుల చప్పుడును వింటూ తరించి పోతుంది పెళ్లి మండపం.

ఊళ్ళో పెద్దలందరు చినుకుల సైజు పెద్దదవక ముందే పెళ్లి మండపంలోకి వచ్చారు . కాని ఈ జోరు వాన వలన గొడుగుల క్రింద , ప్లాస్టిక్ కవరాల క్రింద తలలు దాచుకున్నారు .

వాన వచ్చిన , వరద వచ్చిన  కల్యాణం , కక్కు  ఆగదంటారు నిజమేనేమో ..

వాన వచ్చిన , వరద వచ్చిన  కల్యాణం , కక్కు  ఆగదంటారు నిజమేనేమో అనుకున్న విధంగా కాకపోయిన జరగాల్సిన తంతు విధంగా ఆ రోజు పెళ్లి జరిగిపోయింది. ఎవరిదనుకుoటున్నారు మన సుబ్బారావుది. సుబ్బారావు , తన బార్య మొఖంలో ఆనందం కాని వాళ్ళ తాత , మామ్మ మొఖం లో తెలియని ఆందోళన . కారణం కొత్త కోడలు ఇంట్లోకి వస్తే మా ఇద్దరిలో ఎవరు ఉంటారో, ఎవరో వుండరో అని తెలియక ఇద్దరు మొఖాలు చూసుకుంటున్నారు .

వాన కాస్త వోడులిచ్చింది . భోజనాలు కూడా ముగిసాయి. అప్పగింతల కార్యక్రమం జరుగుతుంది. పెళ్ళికూతురు తల్లి నుండి అత్త గారింటికి వెళ్ళడానికి భాదపడుతున్డటం లో అర్ధం ఉంది. కాని వీళ్ళిద్దరూ భాదపడటం లో అర్ధం లేకుండా పోయింది.

పదహారు రోజుల పండగ ముగిసింది . ఒకరి ఫోటో కి దండ పడింది. సుబ్బారావు వాళ్ళ అమ్మ అంటే రంగమ్మ అత్త చనిపోయింది.

అమ్మపోయిన దిగులులో సుబ్బారావు పొలాన్ని సరిగా చూడడం లేదు . పొలానికి కోపం వచ్చిందో  ఏమో 40 బస్తాలు పండే భూమి ఈ సారి 25 బస్తాలకే పరిమితం అయ్యింది.

సద్దేన్నాలు తినడం , సర్ది చెప్పుకోవడం ఏదైన  మనుషులకు మాత్రమే సాధ్యం కదా!

దిగాలు ఇంకా పెరిగింది, నీరసం వచ్చింది. జ్వరానికి దారి తీసింది.

సుబ్బారావు వాళ్ళ నాన్న భార్య పోయినప్పటి నుండి భాధలో ఉండిపోయాడు. కొడుకుతో అప్పుడప్పుడు పొలానికి వెళ్ళే నాన్న పొలం చూపించిన ప్రతి ఫలాన్ని ఆస్వాదించలేక మంచం ఎక్కాడు . అప్పటినుండి భోజనానికి , స్నానానికి తప్ప మంచం దిగటం లేదు. అల సంవత్సరం కాలం గడిచింది.

సుబ్బారావు మంచి మందులు వాడి జ్వరాన్ని నయం చేసుకున్నాడు . వాళ్ళ నాన్న  మంచం మీద  పడుకొని , పడుకొని నవ్వారుని లూజు చేసుకున్నాడు.

పొద్దున్న సద్దన్నం తిని , పొలానికి బయలు దేరాడు సుబ్బారావు . దారిలో రంగడు కనిపించి ‘ ఏంట్రా ! పోయిన సారి పంట తక్కువ పండింది. అంటగా’ ఊళ్ళో వాళ్ళు ఎవరో చెప్పుకుంటే విన్నాను అన్నాడు .

‘అవును పంటకి పురుగు ఎక్కువ పట్టిందో లేక పురుగుల మందు పంటకి తక్కువ కొత్తనో తెలియదు’ తక్కువ బస్తాలు పండింది అన్నాడు సుబ్బారావు . ఈ సారి ఈ ఎరువులను  వాడు ఎక్కువ బస్తాలు  పండుతాయి అని తన చేతిలో ఉన్న ఎరువులు డబ్బాను చూపించి చెప్పాడు .

ఆ పురుగుల మందు ఖరీదు ఎంత , ఎంత  దిగుబడి వస్తుందో అని గాల్లో లెక్కలేసుకుంటూ పొలానికి వెళ్లి , గడ్డి కోసుకొని తిగిరి ఇంటికి వచ్చాడు . అయినా లెక్కలు ఆపలేదు. పెన్ను పేపరు తీసుకొని లెక్కలేస్తున్నాడు.

కాలం వేగాన్ని పెంచి నడకను పరుగుగా మలుచుకుంది . పొలo  లో వేసిన విత్తనాలు పెరిగిన వయసును చూపించేలా ఏపుగా ఎదిగాయి. వేగానికి వయసు తోడై సుబ్బారావు కు ఇద్దరు కొడుకులు పుట్టి , పెరుగుతున్నారు . కాని శాపమో , దరిద్రమో మంచంలో ఉన్న నాన్న రెండవ కొడుకు పుట్టినప్పుడే మరణించాడు .

మరో సారి తన కుటుంబం “ఆ నలుగురు” గా సాగుతుంది.   

-        Completed  -


Wednesday, March 3, 2021

AA NALUGURU


 


-pradeep devarapally

పేద వారికి పైసలు మీద , డబ్బు ఉన్న వారికి ఆస్తుల మీద వ్యామోహం ఉంటుంది . పేదవాడి పైసా పైసా కలిపితే రూపాయి పోగవుతుంది. బియ్యపు గింజా గింజా కలిసి ఉంటే పొయ్య మీద గిన్నెలో ఎసర  అవుతుంది . అడుగు అడుగు కలిసి వేస్తే గాని పొలానికి దారి చూపుతుంది . చదువు కునే పిల్లలకు  అ .ఆ.. ఇ ...ఈ.... లు అన్ని సరైన క్రమం లో కలిపి పలికితే అక్షరాలు అవుతాయి. మనిషి చివరి నిమషాల్లో శ్వాసకు శ్వాస తోడైతే గాని మరో రోజుకు ...?

ఊరికి చివరన ఇల్లు .పిల్లలు తొక్కుడు బిళ్ళ ఆడినపుడు ఎగిరే గంతులకు ఒకటి లోపలి , ఒకటి బయటకి దాగుడు మూతలు ఆడుతున్నట్టు కనిపించే రాళ్ల రోడ్డు . వరుడికి కోపం వస్తే నీళ్ళు ఇవ్వనట్టు ఎండిపోయి  కనిపించే రోడ్డు పక్కన పొలాలు.  ఇంట్లో ముచ్చటగా మూడు జంతువులు , నలుగురు మనుషులు .

రెండు గేదలు , ఒక కోడి .  ఇక ఇంట్లో నేను , నాన్న , అమ్మ ,తమ్ముడు .

పని తప్ప మరో ద్యాస లేని నాన్న , చదువు తప్ప ఇంకో ఆలోచన లేని తమ్ముడు . నాన్నకు పని సాయంగా నేను ,ఇంట్లో మా అందరితో కలిసి ఉండే అమ్మ.

ఇంటికి నాలుగడుగుల దూరంలో మా తాత పోతూపోతూ ఇచ్చిన 50 సెంట్ల పొలం . నాన్న కష్టం తో సంపాదించిన రెండు గేదలు. రెండు తరాలుగా మారకుండా ఉన్న పెంకుల ఇల్లు . ఇది మా ఇంటి బాహ్య స్వరూపం .

మరి గేటు దాటి ఇంటిలోకి తొంగి చూస్తే ... 

 

 

 

 

 

 

 

 

-to be continued ..


Tuesday, March 2, 2021

THOLIPREMA

 

-pradeep devarapally

గోడకి అనుకోని నిద్రపోతున్న సైకెల్ ని సీటు పై ఒక్కటేసి నిద్ర చాలు ఇక పోదాం పద అన్నటుగా సైగ చేసి సైకులేక్కాడు ప్రకాష్ . రోజూ వెళ్ళే దారి అయిన ఈ రోజు ఎంతో కొత్తగా కనిపిస్తుంది . రోజు రుయ్ రుయ్ మని రోదన చేసే ఆటో , బస్సు ల హారన్ లు ఈ రోజు ఆ శబ్దం ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది . పొలం గట్ల మీద పని చేసే అవ్వ  తాతల ముచ్చట్ల ముసిముసి నవ్వులు తనని ఊహల్లోక్కి తీసుకుపోయింది.

రైలు గేటు దాటిందే స్కూలు రాదు . గేటు దగ్గర ఎండలో వేచి చూసి ,చూసి చిరాకు వచ్చే సందర్భం ఈ రోజు ఆ రెండు గేటులకు మద్య రైలు బండి , ఆ రైలు బండిలో రెండు కిటికీల మద్య రెండు కళ్ళతో విసిరిన సన్నని చూపు ఏదో గుర్తుచేసేటట్టుగా ఉన్నాయి . ఒక్కసారి సైకిల్ దిగి , బ్యాగ్ లో చెయ్యి పెట్టి గులాబి పువ్వును ఒకసారి తడిమీ చూసి , నేను ఈ లోకం లోనే ఉన్నాను అని మెలుకువతో  మరలా సైకెల్ ఎక్కి స్కూల్ గేటు లోని కి వచ్చేసాడు .

రోజూ ఎంతో హడావిడిగా అసెంబ్లీ జరిగే స్కూల్ లోని చిన్న స్టేజి , జాతీయ పతాకం ఇంకా తయారు అవ్వలేదు .   ఎంటబ్బ అని అప్పన్న గదిలోనికి ఒక అడుగు వేసి గడియారం వైపు ఒక కన్ను వేసాడు . టైం 8 కావస్తుంది . ఇంకా అసెంబ్లీ కి చాలా నే టైం ఉంది . నేను తొందరగా లేచాన లేక సూర్యుడు తొoదర పడి వీకువ జామునే మేల్కొన్నడా అర్ధం కాలేదు .

సర్లే ఎలాగో వచ్చానులే కదా అని రోజూ ఆడుకునే స్థలానికి వెళ్తే అక్కడా ఒక్కరు కూడా లేరు . అప్పుడనిపించింది సూర్యుడు కాదు తొందర పడ్డది నేను అని .

పక్కనే ఉన్న మంచి నీళ్ళ ట్యాంక్ దగ్గర కొన్ని నీళ్ళు తాగి , బ్యాగ్ లో నుండి గులాబి పువ్వు తీసి దోసిటతో కొన్ని నీళ్ళు గంధం నీళ్ళు జల్లి నట్టు జల్లాడు .

ఏ కవి చెప్పాడో కాని ఈ మాటలు ఒక్కసారి గుర్తుకు వచ్చాయి . బోర్డర్ కి వెళ్ళే సైనికుడిలా , ట్రోఫి గెలవాలనే ఆటగాడిలా కన్న కళలను నిజం చేసుకోవాలనే యువకుడి ఆలోచనలా తన పువ్వు కి పెట్టుకున్న అమ్మాయిని కలవాలనే కోరికలా

ప్రతి ప్రయాణానికి గమ్యం అవసరం , ఆ గమ్యాన్ని చేసుకోవాలనే నా ఈ పయనం ఇలా మొదలైంది.

అల క్లాసు లో బ్యాగ్ పెట్టి బయటకు వద్దామని లోపలికి  వెళ్లిన ప్రకాష్ కి పయనం లేకుండా గమ్యం ఎదురుగా వచ్చినట్ట నిపించింది.

క్లాసు బయట ఒక జత చెప్పులు , లోపల రెండు కళ్ళతో అమాయకం గా చూపులు ,  లోపలికి  చేరిన  ప్రకాష్ శ్వాస, అప్పటిదాకా గదిలో గాలి ,ఆ అమ్మాయి శ్వాస కు తోడై మూడైనాయి . నాలుగు కోళ్ళు ఉన్న బెంచిని లాక్కుని చేతిలో ఉన్న పువ్వును దేవతకి పెట్టాలని ఎక్కితే , అది ఇటు అటు కిర్ కిర్ మని శబ్దం చేస్తే గబుక్కున ఆ అమ్మాయి లేచి వచ్చి తన చేతిని స్టూల్ పై పెట్టి ఐదవ కోడుగా మారింది.

మరి కొత్త పువ్వు సరస్వతి దేవికి , పాతది ఏం చేద్దామని అటు ,ఇటు చూస్తుండగా ఆరు రుతువుల సాక్షిగా తను చెయ్యి చాచింది .

వెన్నెలలో వడ గండ్ల వానను ఆస్వాదిస్తున్న పిల్లాడిని  ఉరుము వచ్చి బయపెట్టినట్టుగా  , 7వ తరగతి గదిలో ఎనిమిది బెంచీల ముందర ఇచ్చిన పువ్వును తీసుకొనే లోపే అప్పన్న 09:50 కి వచ్చి 10 నిమషాలలో అసెంబ్లీ అని మొదటి బెల్ కొట్టి గుర్తు చేసాడు .

అప్పటినుండి

సూర్యుడిని వంక చేసుకొని ప్రతి రోజు తోదరాగా మేల్కొన్నత్తుగా లేచి , పెరట్లో గులాబి పువ్వు తెంచి , అమ్మ పెట్టిన అన్నం డబ్బా పక్కనే దాన్ని బ్యాగ్ లో పెట్టి , స్కూల్ లోకి వచ్చి అప్పన్న గదిలో టైం చూసి దాహానికి కొన్ని నీళ్ళు తాగి , మరికొన్ని గందాన్ని జల్లి నట్టు జల్లి , తన ప్రేమని సరస్వతీదేవి సాక్షిగా ప్రతిరోజు తెలియచేస్తున్నాడు . ఒక్కమాట లో చెప్పాలంటే వెంకటేశ్వరస్వామి నిత్య పెళ్ళికొడుకు అయితే ప్రకాష్ మాత్రం నిత్య ప్రేమ వ్యక్తపరుడు .

మరి ఆ తర్వాత ...?

-completed


Monday, March 1, 2021

THOLIPREMA

 

-pradeep devarapally

కమ్మగా చెప్పిన కధకో , అమ్మ పెట్టిన ముద్దకో గాని కోడి కూసి చాలా సేపయిన ,ఉదయాన్నే సూర్యుడు వెలుగును విస్తరించుకుంటున్నామనోడు మాత్రం కళ్ళు విప్పలేదు. ఇంతకి మనోడి పేరు చెప్పలేదు కదా ! పేరు ప్రకాష్

కళ్ళకి ఎండ తగిలిందో లేక ఇంట్లో నుండి అమ్మ తిట్లు వినబడ్డాయో గాని ఒక్కసారిగా లేచాడు . లేచి లేవగానే రాత్రి అటక మీద పెట్టిన పుస్తకాలను తీసి ఒక వరుసలో  పెట్టి బ్యాగ్ లో పెట్టుకున్నాడు .

గుమ్మ దగ్గర దండెం పై ఆరేసిన తున్దుని తీసుకొని స్నానం చేసి వచ్చే లోగా ఇంట్లో అమ్మ కమ్మగా రాత్రి మిగిలిన  అన్నం ను తిరమాత పెట్టి పులిహోర గా మార్చేసింది . కొంచెం తిని , మిగతాది డబ్బాలో పెట్టుకొని స్కూల్ కి బయలుదేరాడు . అప్పటికే స్కూల్ లో అసెంబ్లీ పూర్తయి , ఎవరి క్లాసు లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు . ఎక్కడ డ్రిల్ మాస్టర్ చూస్తారేమో అని బయంగా పిల్లి లాగ వెళ్లి వాళ్ళలో కలిసిపోయి క్లాసు లోకి వెళ్ళిపోయాడు .

గడియారంలో  గంటల ముళ్ళు తన స్తానాన్ని మార్చుకుoటుoది. టీచర్లు  నీటి గుంటలలో ఎగిరి ఆడుకునే కప్పు పిల్లల్లా పిరియడ్ పిరియడ్ కి క్లాసులు మారుతూ పాటలు చెప్తున్నారు .  ప్రకాష్  టీచర్ చెప్పే పాటలను వింటూనే ఉన్నాడు  కాని చూసే కళ్ళు , పేల్చే ముక్కు మాత్రం ఎంతకి వాళ్ళు చెప్పే పాటాలను మాత్రం స్వాగతించడం లేదు.

ఎందుకా అనుకుంటున్నారా ? ఒక్కసారి నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలి . తెలుగు టీచర్ క్లాసు చెప్తూ చెప్తూ పాటాలను కూడా ఆపేసి , గోడ మీదకి చూసింది . గోడలు బోసిగా ఉండటo చూసి  టీచర్ ఒక పని చేసింది . అది ఏంటంటే క్లాసు లో నాలుగు పక్కల నాలుగు గోడలు ఉన్నాయి. అవి ఒక్కో సబ్జెక్ట్ కు ఒక్కో గోడను కేతాయిoచమని.ఎదురుగా గణితం నకు , రెండు పక్కలా బౌతిక , సామాన్య శాస్త్రాలకు , ఇంకో గోడ తెలుగు సగం , ఇంగ్లీష్ సగం అని చెప్పింది.

ఇంకా తృప్తి చెందకుండా మనకు చదువు బాగా రావాలంటే చదువుల తల్లి క్లాసు గోడపై ఉండాలి . మీరు వేసుకునే చెప్పులు గుమ్మo బయట ఉండాలి అంది . అంటూ అంటూనే ఆ ఫోటో నేను ఇస్తానులే కాని ఆ ఫోటోకి మాత్రం రోజుకో పువ్వు పెట్టండి . ఎవరు పెడితే వాళ్ళకి చదువు బాగా వస్తుంది  అని చెప్పి టీచర్ తర్వాత క్లాస్ కి వెళ్ళిపోయింది .

మరుసటి రోజు చెప్పిన విధంగానే క్లాసు కు వచ్చేటపుడు సరస్వతి దేవి ఫోటో తెచ్చి , ప్రకాష్ చేత గోడకి మేకు కొట్టించి , ఆ మీకుకి తగిలించింది . ఇంతలో పువ్వు టీచర్ అని అమ్మాయిల్లోంచి  సన్నని గొంతు తొంగు చూసింది . దీంతో మా ఇంట్లో గులాబి చెట్టు ఉంది టీచర్ ! నేను తెస్తా అని పరుగుపెట్టాడు . టీచర్ రేపు వచ్చినపుడు  తేద్దువులీరా  అని అనేలోపే  స్కూల్ గేటు దాటేసాడు .

అలా దాటినా వాడు రెండు క్లాసులు అయిపోయిన తర్వాత క్లాసు కొత్త టీచర్ వెళ్ళిపోయే ముందు ప్రత్యక్షమయ్యాడు . ఇది జరిగిన కధ.

ఇక ప్రస్తుతానికి వస్తే నిన్న పెట్టిన పువ్వు ఫోటో పై లేదు అనే కోపం ఒకవైపు, ఆ పువ్వు పరిమళం తన క్లాసు అమ్మాయి జడలలోనే వుందని గ్రహించిన ముక్కు స్వభావం మరోవైపు .

ఇంతలో ఇంగ్లీష్ సర్ పాటం చెప్తూ ఏదో ఇంగ్లీష్ పదం చెప్పి దాని తెలుగు అర్ధాన్ని అడిగాడు .ఒక్కసారిగా అప్పటిదాకా తూడు మద్య కమలం పువ్వులా ఉన్న అమ్మాయి , ఎవరో చేయి వేల్ల మద్యలో పైకి లేచినట్టు లేచించి.

లేస్తూనే ఆలోచించడం సర్ అంది . ఆలోచన అనగానే పువ్వు గురించి ఆలోచించే ప్రకాష్ ఒక్కసారిగా ఉల్లిక్కపడి పువ్వు కోసం వెతికే వాడి  కళ్ళు ఆ అమ్మాయి ముఖం వైపు , ముక్కు తన జడలో ఉన్న పువ్వుల మకరందం వైపు , చెవులు అమ్మాయి చెప్పే మాటలను వింటున్నాయి . రేడియోలో లోని చిత్రలహరి పోగ్రాం లో మంచి పాట  వినేటప్పుడు నాన్న వచ్చి స్టేషన్ మార్చినట్టు , అమ్మాయి ని చూసిన ‘తొలి చూపు’ లో తన మాటలు విన్తున్నోడికి బడ్లో పనిచేసే అప్పన్న వచ్చి ఇంటి బెల్ కొట్టేసాడు .

సూర్యుడు కూడా వెళ్ళిపోయి చందమామని కూడా స్వాగతం చెప్పేసాడు . ఆరుబయట మంచం మీద అమ్మ కమ్మటి కధలు చెప్పి , కలిపిన ముద్దలు నోట్లో పెట్టి కంచం కూడా పక్కన పెట్టేసింది . కాని అమావాస్య రోజున నల్లని ఆకాశం లో  తెల్లని నక్షత్రాలులా , తన నల్లని జుట్టులో ఎర్రటి గులాబినే గుర్తుకు వస్తుది .

రోజు కోడో , సూర్యుడో , అమ్మో లేపోతే గాని లేచావాడు ఉదయాన్నే లేచి పెరట్లో ఉన్న గులాబి చెట్టు పూలను చూస్తూ కూర్చున్నాడు . ఏరా ! బడికి టైం అవుతుంది పోవా అంటే , పోతానమ్మ అంటూ అటు పూర్తిగా గులాబి రంగు కాదు , అలా అని ఎరుపు రంగు కాకుండా ఉన్న ‘గులాబి పువ్వు’ ని రెండు ఆకులు కింద పట్టుకుని తెంపి అమ్మా ఇచ్చిన అన్నం డబ్బా పక్కన బద్రంగా పెట్టి బడికి బయలు దేరాడు 

                                                    
                                                 -
To be continued   

THOLIPREMA

-pradeep devarapally

 విశాలం గా ఉన్న వరండాలో టీచరు క్లాసు కి లేటు అవుతుంది అని వేగంగా నడుచుకుంటూ క్లాసు లోకి వెళ్ళింది . అప్పటికే పిల్లలందరితో  నిండిపోయిన క్లాసు రూమ్ పూర్తిగా ఉడికిన గిన్నెలో అన్నం ఎలా కుత కుత మని శబ్దం చేస్తుందో , అలా పిల్లలందరూ కుయ్ కుయ్ మని ఎవరికి నచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ ఉన్నారు .

క్లాసు లో కి వెళ్ళిన టీచర్ ని చూడగానే అన్నం ఉడికిందని గమనించి పొయ్యి మీద నుండి అన్నం గిన్నె తీసేస్తే సుయ్ మని శబ్దం వచ్చి ఆగిపోతుందో ,అలా టీచర్ ని చూడగానే రేయ్, ఏరా, వసేయ్ అంటూ అల్లరి చేసే పిల్లల అరుపులు ఒక్కసారిగా ఆగిపోయి గుడ్ మార్నింగ్ టీచర్ అని ఆనందంతో కేకలు వేసే పక్షి పిల్లలు లాగా అరిచారు . మొఖం మీద చెమట ను చీర కొంగుతో తుడుచుకుంటూ , సిట్ డౌన్ అంది.

మొదటి రోజు కాబట్టి టీచర్ కూడా కాస్త కంగారు పడుతూ టెక్స్ట్ బుక్ ఓపెన్ చెయ్యడానికి చేతులు సాహసించిన ,కంగారు రెండు చేతులతో టెక్స్ట్ బుక్ ను బోర్ల తిరగ వేసింది. ఇంకా 30 నిమషాలు   చేసేదేది లేక సరే ! ఒక్కొక్కరు లేచి మీ పేరు చెప్పి కూర్చోండి అంది.

ఎవరో పెద్దవాళ్ళు చెప్పినట్టు ఆడవాళ్ళతో మొదలు పెట్టాలని నా పేరు సులోచన అని మొదటి బెంచి లో  నుంచి లేచి పేరు చెప్పి కూర్చుంది . టీచర్ తర్వాత అంటే నా పేరు శ్యామల అంది , తర్వాత అంటే సుమా , వాణి, లక్ష్మి అంటూ .....అమ్మాయిలు అందరు చెప్పారు . తర్వాత అబ్బాయిలు అంటే మొదటి బెంచి లో కూర్చుంటే స్కూల్ ఫస్ట్ వస్తాడంట అని వాళ్ళ తాత చెప్పిన మాటలకి అదే బెంచిలో కూర్చొని మొదటి రోజు అన్ని పుస్తకాలు వీపున వేసుకొని వచ్చి సర్దుకుంటూ  నా పేరు శ్రీను అని చెప్పి కూర్చున్నాడు . తర్వాత అంటే కొత్త బట్టలు వేసుకొని బెంచి మీద కూర్చుంటే ఎక్కడ నలిగి పోతాదేమో అని భయం తో బెంచికి సగం , కాళ్ళను భూమికి ఆనించి బెంచిని సగం వెనకాల వదిలేసి ముందుకు కుర్చున్న వాడు ఒక్కసారిగా లేచి శ్యాము అని కేక పెట్టాడు . మాములుగా వీడి గొంతు చిన్నదిగా ఉంటుంది , కాని బెంచికి సగం ముందుకి కూర్చొని ఒక్కసారిగా లేవడం వలన రెండు మొకాళ్ళు బెంచికి గట్టగా తగిలాయి . అలా మాట కేక వేసింది . టీచర్ తర్వాత అంటే బెంచిలో పక్కనే బ్యాగ్ ఉంది కాని ఎవరు లేరు . ఆ తర్వాత టీచర్ అంటే వేణు టీచర్ , గణేష్ టీచర్ , రాము టీచర్ , .... అని అందరు ఒక్కొకరి తర్వాత ఒకరు గాల్లో ఎగిరే వరుస పక్షుల మాదరిగా చెప్పసాగారు .

ఇలా చెప్తుండగానే 30 నిమిషాల సమయం 03 నిమిషాలకు వచ్చింది . దొంగ తనం చేసిన దొంగలా చెమటలు కక్కుకుంటూ ఆ చెమటను ఎడమ చొక్కాతో తుడుచుకుంటూ , కుడి చేతితో గుడ్ మార్నింగ్ చెప్పి చెప్పనట్టు గా సగం పైకి లేపి గాల్లో ఉంచాడు.   ఈ అవతారంను చూసిన టీచర్ ఏంట్రా ! ఆ బట్టలు అని అడుగుదామని పించినా , గంట మోగేసరికి సరే లోపలి రా , నేను బయటకు వెళ్ళే టైం అయ్యింది అని వెళ్ళిపోయింది.

సూర్యుడు నిట్టనిలువు నుండి 270 కోణం దాటి 300 దగ్గరకి చేరుకుంటున్నాడు . పక్షులు కిల కిల మని తన సొంత గూటికి వెళ్ళే పయనాన్ని ప్రారంబించాయి. టీచర్లు R.T.C బస్సు ఎక్కడ వెళ్లి పోతుందో అని క్లాసులో పాతాల మీద కంటే చుట్టూ వినిపించే శబ్దాల పైన ఎక్కువ ద్యాస పెట్టారు . చివరికి సాయంత్రం గంట మోగింది , ఎవరి గూటికి వాళ్ళు చేరుకున్నారు .

గుమ్మ బయట గేదలకు వేసే గడ్డి పొగ దాని తీవ్రతను తగ్గించి నిశ్శబ్దంగా గా గాలితో ఆడుకుంటున్న సమయం .

రేడియోలో ఆకాశవాణి  ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అని మధ్య గదిలోంచి గుమ్మo బయటకు నెమ్మదిగా వినిపిస్తుంది.

అమ్మా ! ఆకలి అంటూ ఆరుబయట మడత మంచం పై కుర్చుని  (దొంగ తనం చేసిన దొంగలా చెమటలు కక్కుకుంటూ ఆ చెమటను ఎడమ చొక్కాతో తుడుచుకుంటూ , కుడి చేతితో గుడ్ మార్నింగ్ చెప్పిన వాడు ) , పొగ కూడా కనిపించే వెలుగులో బ్యాగ్ లోంచి పుస్తకాలను తీసి అటు ఇటు తిరగేస్తూ ఉన్నాడు . కంచంలో అన్నం పెట్టుకొచ్చిన తల్లి ఏంట్రా ! పొద్దుపోయింది ఇంకా చాలులే ఆ చదువు , పుస్తకాలు ఆ సూరి మీద పెట్ట్టిరా అన్నం పెడతా అంది . అన్నం తినిపించిన అమ్మ కమ్మగా నాలుగు మాటలు చెప్పేసరికి చందమామకే అమ్మ కద చెప్తే ఎలా నిద్రపోతుందో అలా ఆ రాత్రి హాయిగా వెన్నెలలో చెట్ల ఆకులు పాడే జోల పాటలాంటి గాలిని స్పర్శిస్తూ నిద్రపోయాడు .

                  -to be continued Nxt chapter